న్యూఢిల్లీ: దేశంలో పెచ్చరిల్లుతున్న విద్వేష నేరాలకు అడ్డుకట్ట వేయాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మూక హింస, విద్వేష ప్రసంగాల నివారణకు 2018లో తాము జారీ చేసిన మార్గదర్శకాలను పటిష్ఠం చేయనున్నట్టు ప్రకటించింది.
హర్యానాలోని నుహ్లో అల్లర్లు, విద్వేష ప్రసంగాల నివారణకు చర్యలు తీసుకోవాలని దాఖలైన పిటిషన్లపై సుప్రీంలో విచారణ కొనసాగింది.