Somanath | భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ, ఇస్రో చీఫ్ సోమనాథ్ (ISRO chief Somanath) క్యాన్సర్ (Cancer) బారిన పడ్డారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ఆదిత్య-ఎల్ 1 లాంచ్ (Aditya-L1 launch) రోజున తనకు క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ అయినట్లు ఇస్రో చీఫ్ తెలిపారు.
తార్మాక్ మీడియా హౌస్కి ఇచ్చిన మలయాళ ఇంటర్వ్యూలో ఇస్రో చీఫ్ సోమనాథ్ మాట్లాడుతూ.. చంద్రయాన్-3 మిషన్ ప్రయోగ సమయంలో కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తాయని సోమనాథ్ తెలిపారు. అయితే, ఆ సమయంలో క్యాన్సర్ ఉందనే విషయం తనకు స్పష్టంగా తెలియదని, దాని గురించి స్పష్టమైన అవగాహన కూడా లేదని చెప్పుకొచ్చారు. ఆదిత్య ఎల్-1 మిషన్ ప్రయోగించిన రోజు ఉదయం వైద్య పరీక్షలు చేయించుకున్నట్లు చెప్పారు. అప్పుడే క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యిందని వివరించారు. ఈ విషయం తెలిసిన వెంటనే కుటుంబ సబ్యులు, సహోద్యోగులు షాక్కు గురైనట్లు సోమనాథ్ చెప్పుకొచ్చారు.
ఆపరేషన్ చేయించుకోవాలని వైద్యులు సూచించినట్లు చెప్పారు. శస్త్రచికిత్సతోపాటు కీమోథెరపీ కూడా చేయించుకున్నట్లు తెలిపారు. ఈ వ్యాధి బయటపడిన తర్వాత తొలుత కాస్త కంగారు పడినట్లు చెప్పారు. అయితే క్యాన్సర్కు చికిత్స ఉందన్న విషయంపై ఇప్పుడు పూర్తి అవగాహన వచ్చిందన్నారు. ప్రస్తుతం క్యాన్సర్ నుంచి పూర్తిగా కోలుకున్నట్లు వెల్లడించారు.
Also Read..
Landslides | షాకింగ్.. వాహనాలపై పడ్డ భారీ బండరాళ్లు.. VIDEO
Leopard | నీటి కోసం బిందెలో తలపెట్టి ఇరుక్కుపోయిన చిరుత.. వీడియో
Tapas Roy | పార్లమెంట్ ఎన్నికలకు ముందు తృణమూల్ కాంగ్రెస్కు గట్టి షాక్.. సీనియర్ నేత రాజీనామా