న్యూఢిల్లీ: ఇస్రోలో చేరడానికి ఐఐటీయన్లు ఆసక్తి చూపటం లేదని, దీంతో అత్యుత్తమ ఇంజనీరింగ్ టాలెంట్ను పొందలేకపోతున్నామని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇస్రో వేతనాలే ఇందుకు కారణం కావొచ్చునని అన్నారు. ‘ఇంజినీర్లు, ఐఐటీయన్లు నైపుణ్యం కలిగిన మానవ వనరులు.
అయితే వారిని ఇస్రోలో చేర్చుకునేందుకు వెళితే, ఎవ్వరూ ఆసక్తిచూపటం లేదు. కొద్ది మంది విద్యార్థులు మాత్రమే అంతరిక్షంపై ఆసక్తితో వస్తున్నారు’ అని సోమనాథ్ అన్నారు. ఇస్రో బృందం ఐఐటీలో నిర్వహించిన రిక్రూట్మెంట్ డ్రైవ్ గురించి చెబుతూ, ‘ఇస్రోలో అత్యధిక వేతనం ఎంతుంటుందన్నది చెప్పగానే, 60% మంది ఐఐటీయన్లు రిక్రూట్మెంట్ డ్రైవ్ నుంచి బయటకు వెళ్లిపోయారు’ అని అన్నారు.