Israel : నేటి టెక్నాలజీ యుగంలో బాంబు దాడులు ఎంత తీవ్రంగా ఉంటాయో చెప్పేందుకు ఈ దాడి ఒక ఉదాహరణ. లెబనాన్పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడి.. ఏకంగా భారీ భూంకపాన్ని సృష్టించింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్ని లెబనాన్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. భూకంప తీవ్రత 4.1గా నమోదైనట్లు అమెరికాకు చెందిన జియోలాజికల్ సర్వే సంస్థ వెల్లడించింది.
లెబనాన్లో హెజ్బొల్లా ఉగ్ర సంస్థకు చెందిన స్థావరాలు ఉన్న సంగతి తెలిసిందే. వీటిపై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. తాజాగా అలి అల్ తాహెర్ రిడ్జ్ ప్రాంతంలోని హెజ్బొల్లాకు చెందిన ఒక టన్నెల్పై ఇజ్రాయెల్ వైమానిక దాడికి పాల్పడింది. ఈ భారీ దాడితో ఆ టన్నెల్ కూలిపోయింది. ఇదే సమయంలో బాంబు తీవ్రత కారణంగా చుట్టుపక్కల ప్రకంపనలు వచ్చాయి. దీని కారణంగా స్థానికంగా భూకంపం నమోదైంది. ఈ భూకంపం తీవ్రత 4.1గా ఉన్నట్లు అమెరికా సంస్థ తెలిపింది.
<blockquote class=”twitter-tweet”><p lang=”en” dir=”ltr”>Southern Lebanon experienced a magnitude-4.1 earthquake triggered by Israeli explosives detonated at the Ali Taher ridge, the US Geological Survey confirmed. <a href=”https://t.co/wbBjIlGkNU”>pic.twitter.com/wbBjIlGkNU</a></p>— HatsOff (@HatsOffff) <a href=”https://x.com/HatsOffff/status/2098360905708843075?ref_src=twsrc%5Etfw”>September 11, 2026</a></blockquote> <script async src=”https://platform.x.com/widgets.js” charset=”utf-8″></script>
దక్షిణ లెబనాన్లోని నబాతే సహా అనేక ప్రాంతాల్లో ప్రకంపనలు కనిపించినట్లు వెల్లడించింది. లెబనాన్పై జరిపిన ఈ దాడిని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, రక్షణ శాఖ మంత్రి ఇజ్రాయెల్ కట్జు కూడా అంగీకరించారు. దశాబ్దాల క్రితం ఇరాన్ నిధులతో నిర్మించిన తీవ్రవాద స్థావరాల్ని ధ్వంసం చేసినట్లు వారు ప్రకటించారు. ఈ ప్రాంతంపై పట్టు సాధించినట్లు చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో కూడా విడుదలైంది.