న్యూఢిల్లీ : భారత్పై ‘హమాస్’ తరహా దాడి చేపడతామంటూ ఖలిస్థాన్ ఉగ్రవాది, సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్జే) చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నున్ బెదిరింపులకు దిగాడు. ‘పంజాబ్పై భారత్ ఆక్రమణకు పాల్పడితే, తగిన విధంగా స్పందిస్తాం. హమాస్ తరహా దాడికి పాల్పడతాం’ అంటూ ఆన్లైన్లో ఓ వీడియోను విడుదల చేశాడు. ‘పాలస్తీనా-ఇజ్రాయెల్ సంక్షోభం నుంచి ప్రధాని మోదీ నేర్చుకోవాలి. పాలస్తీనా స్పందించినట్టుగా పంజాబ్ ప్రజలు కూడా రియాక్ట్ అవుతారు. హింసకు సమాధానం ప్రతి హింస అవుతుంది’ అని ముందస్తుగా రికార్డ్ చేసిన ఓ వీడియోలో భారత్కు హెచ్చరిక జారీచేశాడు. కెనడాలో హర్దీప్సింగ్ నిజ్జర్ హత్యకు ఎస్ఎఫ్జే ప్రతీకారం తీర్చుకుంటుందని పేర్కొన్నాడు.