న్యూఢిల్లీ, డిసెంబర్ 4: ఛత్తీస్గఢ్లో ఓ సాధారణ పౌరుడు, కూలీ చేసుకుంటూ జీవితాన్ని గడుపుతున్న ఈశ్వర్ సాహు అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాడు. జెయింట్ కిల్లర్గా మారాడు. ఏడు సార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పనిచేసిన రవీంద్ర చౌబేను ఎన్నికల్లో మట్టికరిపించాడు. కొంతకాలం కిందట మూకదాడిలో ఈశ్వర్ సాహు కుమారుడు మరణించాడు. ఈ ఘటనపై స్థానికంగా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీన్ని ఆసరాగా చేసుకోవాలనుకున్న బీజేపీ సాహుకు టికెట్ ఇచ్చింది. దీంతో 5,000 ఓట్ల మెజారిటీతో రవీంద్ర చౌబేపై ఈశ్వర్ సాహు గెలిచాడు.