న్యూఢిల్లీ : మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒక్కోసారి మోసపోతుంటాం. ఐపీఎస్ అధికారికి ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది. ఈ ఘటన గురించి సదరు అధికారి అరుణ్ బోథ్రా ట్విట్టర్లో (Viral Post) పోస్ట్ చేశారు. ఇటీవల ఐపీఎస్ అధికారి అరుణ్ బోథ్రా దోశ తినేందుకు ఓ రెస్టారెంట్ వద్ద ఆగారు. దోసె తిన్న తర్వాత వెయిటర్ బిల్లు తీసుకురాగా అందులో రెండు దోశలకు చార్జ్ చేశారు. తాను ఒక దోశ తిన్నానని రెండింటికి బిల్లు ఎందుకు వేశారని ఆయన అడగ్గా వెయిటర్ రిప్లైతో షాక్ తిన్నారు.
ఐపీఎస్ అధికారితో తాను వచ్చానని చెబుతూ పక్క టేబుల్ వ్యక్తి దర్జాగా దోశ లాగించి బిల్లు వచ్చే సమయానికి ఉడాయించాడని తెలుసుకోవడంతో అవాక్కయ్యారు. ట్విట్టర్ పోస్ట్లో ఈ ఘటన గురించి ఐపీఎస్ అధికారి వివరంగా రాసుకొచ్చారు. ఈ పోస్ట్పై నెటిజన్లు తలో రకంగా కామెంట్ చేశారు.
Went to a restaurant alone to have a dosa. Was puzzled to see the bill that mentioned two dosa.
On asking the waiter said one person sitting on other side took a masala dosa saying that he was accompanying me. He had left by the time bill came.
🙄🙄🙄
— Arun Bothra 🇮🇳 (@arunbothra) May 8, 2023
ఈసారి మీతో పాటు మమ్మల్ని కూడా హోటల్కు తీసుకువెళితే ఇలాంటివి జరగకుండా చూస్తామని ఓ యూజర్ కామెంట్ చేయగా, ఉచితంగా తినేసిన వ్యక్తి ఎవరో సీసీటీవీ ఫుటేజ్ను చూస్తే తెలిసిపోతుందని మరో యూజర్ రాసుకొచ్చారు. రెస్టారెంట్తో పాటు ఐపీఎస్ అధికారికి టోకరా ఇచ్చిన వ్యక్తి చాలా స్మార్ట్ అంటూ మరో యూజర్ కామెంట్ చేశారు.
Read More