ముంబై : మహారాష్ట్రలో ఇవాళ ఈడీ(Enforcement Directorate) అధికారులు సోదాలు నిర్వహించారు. పంకజ్ మెహదియా(Pankaj Mehedia)కు చెందిన ప్రదేశాల్లో ఆ దాడులు జరిగాయి. నాగపూర్, ముంబైతో పాటు మొత్తం 15 చోట్ల ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ తనిఖీలు చేపట్టింది. ఆ సోదాల్లో సుమారు రూ.5.51 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు(Jewellery), మరో రూ.1.21 కోట్ల నగదును ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పంకజ్ మెహదియా, లోకేశ్, కార్తీక్ జైన్లు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్(Investment Fraud)కు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో మరింత విచారణ కొనసాగనున్నట్లు ఈడీ వర్గాలు చెప్పాయి.
Maharashtra | ED has conducted searches & survey at 15 locations in Nagpur & Mumbai in relation to the investment fraud by Pankaj Mehadia, Lokesh & Kathik Jain. Unaccounted jewellery worth Rs 5.51 crore and cash Rs 1.21 crore has been seized. Further investigation is underway:ED pic.twitter.com/xXMrq7eXw1
— ANI (@ANI) March 6, 2023
పంకజ్ మెహదియా భారీ అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలోని ఇన్వెస్టర్ల నుంచి అతను అధిక మొత్తంలో డబ్బులు సేకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. మెహదియా కంపెనీల్లో(Mehedia companies) ఆ పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది. పలు కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన అతను.. ప్రస్తుతం తన వద్ద క్యాష్ లేదని చేతులు ఎత్తేశాడు. ఇన్వెస్టర్ల సొమ్మును అతను తిరిగి చెల్లించలేకపోయాడు. అనేక మంది నగదు రూపంలో ఇన్వెస్ట్ చేయడం వల్ల.. వాళ్లంతా ఫిర్యాదు ఇచ్చేందుకు వెనుకాడుతున్నట్లు తెలుస్తోంది.
మెహదియా కంపెనీల్లో సుమారు వెయ్యి కోట్ల మేర అక్రమ ఇన్వెస్ట్మెంట్ జరిగినట్లు ఈడీ విచారణలో తేలింది. ఒకవేళ పెట్టుబడిదారులకు(Investors) ఇంట్రెస్ట్ కూడా ఇస్తే అప్పుడు ఆ మొత్తం సుమారు రెండు వేల కోట్లు ఉంటుందని భావిస్తున్నారు. మెహిదియా తన కంపెనీలకు ఇన్వెస్టర్లను ఆకర్షించి.. ఆ తర్వాత ఆ సొమ్మును ఇతర కంపెనీలకు తరలించినట్లు ఆరోపణలు ఉన్నాయి.