న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: బీమారంగ సంస్థ ‘ఎల్ఐసీకి బీహార్ జీఎస్టీ అధికారులు షాక్ ఇచ్చారు. ‘ఐటీసీ’ (ఇన్ ట్యాక్స్ క్రెడిట్) సౌకర్యాన్ని వాడుకోవటంలో నిబంధనల్ని ఉల్లంఘించారని ఆరోపిస్తూ, వడ్డీతో సహా రూ.290 కోట్లు చెల్లించాలంటూ ఎల్ నోటీసు పంపారు. ఈ నేపథ్యంలో దీనిని సవాల్ చేసేందుకు ఎల్ సిద్ధమవుతున్నది. ‘అప్పిలెట్ ట్రిబ్యునల్’ను ఆశ్రయించనున్నట్టు తాజాగా వెల్లడించింది.
జీఎస్టీ వర్తించని పాలసీదారుల ప్రీమియంపై, ఏజెంట్ల కమిషన్లపై ఎల్ఐసీ ‘ఐటీసీ’ని వాడుకోవటం నిబంధనలకు విరుద్ధమని బీహార్ అడిషనల్ కమిషనర్ (స్టేట్ ట్యాక్స్) నుంచి గత గురువారం ఎల్ఐసీకి నోటీసు అందింది. రూ.166 కోట్లు పన్ను, వడ్డీ రూ.107 కోట్లు, జరిమానా రూ.16.67, మొత్తం రూ.290 కోట్లు చెల్లించాలంటూ నోటీస్లో పేర్కొన్నది.