ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవం ఎదుర్కొంది. గట్టి పోటీ ఇస్తుందనుకున్న పంజాబ్లో కూడా ఆ పార్టీ మట్టి కరిచింది. ఈ క్రమంలో పంజాబ్కు చెందిన కాంగ్రెస్ ఎంపీ జస్బీర్ సింగ్ గిల్ నోరు విప్పారు. స్వరాష్ట్రంలో తమ పార్టీ ఓటమికి అంతర్యుద్ధాలే కారణమంటూ ఆయన ట్వీట్ చేశారు.
‘‘పార్టీలో గొడవలు, నోట్లకు టికెట్లు అమ్మడం, కార్యకర్తల నమ్మకాలను వమ్ము చేయడం, పెరిగిపోయిన ఈగోలు, నాయకుల అహంకారం.. ఇవన్నీ కలిసి పంజాబ్లో కాంగ్రెస్ను తీవ్రంగా దెబ్బతీశాయి’’ అని జస్బీర్ సింగ్ ఆరోపించారు. ఇక నుంచి అయినా పార్టీ టికెట్ల పంపిణీని కాంగ్రెస్ నాయకత్వం సమీక్షించాలని, బాధ్యతలను సరిగా నిర్వర్తించాలని కోరారు. కాగా, పంజాబ్ ఎన్నికల్లో కాంగ్రెస్ చాలా ఘోరంగా ఓడిన సంగతి తెలిసిందే.
అంతకుముందు ఈ పార్టీ నుంచి సీఎంగా ఉన్న అమరీందర్ సింగ్ తన పదవికి కొంతకాలం క్రితం రాజీనామా చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా తప్పుకున్నాడు. కీలక నేత, పీసీసీ అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధూకు అమరీందర్ సింగ్తో విభేదాలు ఉన్నాయి. వీరిద్దరి గొడవలో కాంగ్రెస్ అధిష్టాన సిద్ధూకు మద్దతుగా నిలిచింది.
దీంతో పార్టీకి వీడ్కోలు పలికిన అమరీందర్ సింగ్.. సొంతగా పార్టీ పెట్టుకొని, బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ఆయన కూడా ఈ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. పంజాబ్లోని 117 సీట్లలో ఆప్కు 79 సీట్లు దక్కాయి. ఇంకో 13 చోట్ల ఆధిక్యంలో ఉంది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ 13 సీట్లలో గెలుపొందగా.. మరో ఐదు చోట్ల ఆధిక్యంలో నిలిచింది.
Infighting, indiscipline, tickets for notes,workers disenchantment,inflated ego & arrogance of leaders have mauled Congress in Punjab
— Jasbir Singh Gill MP (@JasbirGillKSMP) March 10, 2022