బెంగళూరు: ఒక ఉపాధ్యాయుడు మద్యం సేవించి స్కూల్కు వచ్చాడు. తాగిన మత్తులో క్లాస్ రూమ్లో నేలపై నిద్రపోయాడు. స్కూల్ సిబ్బంది, విద్యార్థులు ఎంత లేపినా లేవలేదు. ఈ విషయం స్థానికులు, గ్రామ పెద్దలకు తెలిసింది. దీంతో ఆ టీచర్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశాడు. కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పేర్డూరు గ్రామ పరిధిలోని అలంగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా కృష్ణమూర్తి పని చేస్తున్నాడు. బుధవారం అతడు మద్యం సేవించి స్కూల్కు వచ్చాడు. మద్యం మత్తులో తరగతి గదిలోని నేలపైనే పడుకున్నాడు. గమనించిన స్కూల్ సిబ్బంది, విద్యార్థులు ఆ టీచర్ను నిద్ర నుంచి లేపేందుకు తెగ ప్రయత్నించి విఫలమయ్యారు.
కాగా, ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ విషయం స్థానికులకు, ఆ గ్రామ సర్పంచ్, ఇతర గ్రామ పెద్దలకు తెలిసింది. దీంతో తాగి వచ్చి మద్యం మత్తులో స్కూల్లో నిద్రించిన టీచర్ కృష్ణమూర్తిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆ జోన్ విద్యాశాఖ అధికారికి ఫిర్యాదు చేశారు.