ముంబై: పారిశ్రామిక దిగ్గజం ముకేశ్ అంబానీకి మరో బెదిరింపు మెయిల్ వచ్చిందని పోలీసులు మంగళవారం తెలిపారు. రూ.400 కోట్లు డిమాండ్ చేస్తూ గుర్తు తెలియని వ్యక్తి దీనిని అంబానీ కంపెనీకి సోమవారం పంపినట్లు ఓ అధికారి చెప్పారు.
అంబానీ కంపెనీకి నాలుగు రోజుల్లో వచ్చిన మూడో బెదిరింపు మెయిల్ ఇది. రూ.20 కోట్లు డిమాండ్ చేస్తూ శుక్రవారం తొలి మెయిల్ వచ్చింది. రూ.200 కోట్లు డిమాండ్ చేస్తూ శనివారం మరొక మెయిల్ వచ్చింది. వీటిని పంపినవారిని గుర్తించేందుకు ముంబై పోలీసులు, క్రైమ్ బ్రాంచ్, సైబర్ టీమ్స్ ప్రయత్నిస్తున్నాయి.