భోపాల్: మహిళా పథకం వల్ల మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందికి జీతాలు అందడం లేదని మధ్యప్రదేశ్లోని ఇండోర్ మేయర్ (Indore Mayor), బీజేపీ నాయకుడు పుష్యమిత్ర భార్గవ ఆరోపించారు. ఆ రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం మహిళలకు ప్రతి నెలా రూ.1250 ఇచ్చే లాడ్లీ బెహనా యోజన వల్ల మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, సిబ్బందికి గత ఆరు నెలలుగా జీతాలు అందలేదని మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో అన్నారు. అలాగే ప్రభుత్వం నుంచి గ్రాంట్లు తక్కువగా వస్తున్నాయని, మున్సిపల్ కార్పొరేషన్కు రూ.850 కోట్ల అప్పులు ఉన్నాయని వెల్లడించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కాగా, ఇండోర్ మేయర్ పుష్యమిత్ర భార్గవ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ప్రధాని నరేంద్ర మోదీపై మండిపడింది. ‘లాడ్లీ బెహనా యోజన కారణంగా ఉద్యోగులు తమ జీతాలు పొందడం లేదని ఇండోర్ మేయర్ అంగీకరించారు. మిస్టర్ మోదీ, మీకు ఓట్లు మించి ఏమీ కనిపించదు’ అని ఎక్స్లో విమర్శించింది.
इंदौर महापौर ने स्वीकार किया,
―लाड़ली बहना योजना की वजह से कर्मचारियों को वेतन नहीं मिल रहा।मोदी जी,
आप वोट के आगे कुछ नहीं देखते❓ pic.twitter.com/BHay7tbFYU— MP Congress (@INCMP) February 16, 2024