న్యూఢిల్లీ : జిమ్లో ఎక్సర్సైజ్ చేస్తుండగా గుండెపోటుకు గురై ఇండోర్కు చెందిన హోటల్ యజమాని (55) కుప్పకూలి ప్రాణాలు కోల్పోయారు. ఫిట్నెస్ సెంటర్లో చోటుచేసుకున్న ఈ ఘటన అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లోనూ రికార్డైందని పోలీసులు తెలిపారు. ఈ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Heart-attack से एक और मौत।
वीडियो Indore का बताया जा रहा है। pic.twitter.com/cma5BIx680— Neharika Sharma (@neharikasharmaa) January 5, 2023
ఈ వీడియోలో రెస్టారెంట్, హోటల్ యజమాని ప్రదీప్ రఘువంశీ వర్కవుట్ చేస్తూ అసౌకార్యానికి గురై సెకండ్ల వ్యవధిలోనే కింద పడిపోవడం కనిపిస్తుంది. రఘువంశీని సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లగా ఆయన మరణించారని వైద్యులు నిర్ధారించారు. వ్యాయామం చేస్తూ పలువురు కుప్పకూలి ప్రాణాలు విడుస్తున్న ఉదంతాలు ఇటీవల వెలుగుచూడటం ఆందోళన రేకెత్తిస్తోంది. గుండె పోటు, సడన్ కార్డియాక్ అరెస్ట్తో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
హృద్రోగాలు, గుండె పోటుతో అనూహ్య మరణాలను తగ్గించాలంటే ప్రతి ఒక్కరూ రోజూ తగు మోతాదులో వ్యాయామం చేయాలని, ఒత్తిడిని అధిగమిస్తూ కొలెస్ట్రాల్ లెవెల్స్ను అదుపులో ఉంచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వీటితో పాటు పొగతాగడం, ఆల్కహాల్కు దూరంగా ఉండటం, ఆరోగ్యకరమైన బరువును మెయింటైన్ చేయడం, సమతులాహారం తీసుకోవడంతో పాటు ఉప్పు, చక్కెర, తీపిపదార్ధాలను మితంగా తీసుకుంటూ ప్రాసెస్డ్ ఆహారానికి దూరంగా ఉండాలని చెబుతున్నారు.