Indigo | ప్రైవేట్ విమానయాన సంస్థ `ఇండిగో` టెక్నికల్ సిబ్బంది సిక్ లీవ్లో వెళ్లారు. హైదరాబాద్, ఢిల్లీల్లో పని చేస్తున్న సిబ్బంది తమ అతి తక్కువ వేతనాలకు వ్యతిరేకంగా రెండు రోజులుగా నిరసన తెలుపుతున్నారని సంస్థ వర్గాలు తెలిపాయి. ఈ నెల రెండో తేదీన ఇండిగో దేశీయ విమాన సర్వీసులు ఆలస్యమయ్యాయి. గణనీయ సంఖ్యలో క్యాబిన్ సిబ్బంది సిక్ లీవ్లో ఉండటమే దీనికి కారణమని తెలుస్తున్నది. దీనిపై స్పందించేందుకు ఇండిగో అధికార ప్రతినిధి నిరాకరించారు.
కానీ, సిక్లో ఉన్న వారంతా టాటా సన్స్ ఆధీనంలోని ఎయిరిండియా చేపట్టిన రిక్రూట్మెంట్ డ్రైవ్లో పాల్గొనేందుకు వెళ్లి ఉంటారని ఏవియేషన్ ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. కరోనా ఉధృత స్థాయికి చేరుకోవడంతో ఇండిగో తన ఉద్యోగుల వేతనాల్లో కోత విధించింది.
ఇదిలా ఉంటే, కొత్తగా వస్తున్న `ఆకాశ ఎయిర్`, పునర్వ్యవస్థీకరించిన జెట్ ఎయిర్వేస్, టాటా సన్స్ ఆధీనంలోని ఎయిరిండియా కూడా కొత్తగా ఉద్యోగుల నియామకాలు చేపట్టాయి. కొత్తగా వచ్చిన అవకాశాలను అంది పుచ్చుకునేందుకు పలువురు ఇతర ఎయిర్లైన్స్ సంస్థల ఉద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని సమాచారం.