IndiGo | దేశీయ విమానయాన దిగ్గజ సంస్థ ఇండిగో (IndiGo).. తన ప్రయాణికులకు (Passengers) షాకిచ్చింది. విమానాల్లో సీటు ఎంపిక ఛార్జీలను భారీగా పెంచేసింది (airline hiking the charges). ఇండిగో విమానాల్లో ఎక్కువ లెగ్ రూమ్ ఉండే ముందు సీట్ల (Seat Front Row) ఎంపిక కోసం ఏకంగా రూ.2,000 వరకూ ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు ఛార్జీలను పెంచుతూ విమానయాన సంస్థ నిర్ణయం తీసుకుంది.
వివిధ సేవలకు పేర్కొన్న ఛార్జీలకు సంబంధించిన వివరాలను ఇండిగో సంస్థ తమ అధికారి వెబ్సైట్లో పేర్కొంది. ఆ వివరాల ప్రకారం.. 232 సీట్లు ఉన్న ఎయిర్బస్ ఏ321 విమానంలో ముందు వరుస విండో సీటు కోసం రూ. 2,000 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇక మధ్య సీటు కోసమైతే రూ. 1,500 వరకు వసూలు చేస్తారు. అదే 222 సీట్లు కలిగిన ఏ321, 186 సీట్లు ఉన్న ఏ320, 180 సీట్లు ఉండే ఏ320 విమానాల్లో కూడా ఇవే ధరలు వర్తిస్తాయి. ఇక ఏటీఆర్ విమానాల్లో సీట్లను ఎంచుకునేందుకు అదనంగా రూ. 500 వరకు చెల్లించాల్సి ఉంటుంది.
ఈ ఛార్జీల పెంపును ఏవియేషన్ విశ్లేషకులు అమేయ జోషి ధృవీకరించారు. ‘విమానంలో అదనపు లెగ్రూమ్తో ముందు వరుస సీట్ల ఎంపిక ఛార్జీని ఇండిగో గరిష్టంగా రూ.2000 వరకు పెంచింది. గతంలో ఇది రూ.1500గా ఉండేది’ అని తెలిపారు. కాగా సీట్ల ఎంపిక ఛార్జీల పెంపుపై ఇండిగో ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు.
Also Read..
Air India Express | భువనేశ్వర్ వెళ్తున్న విమానంలో సాంకేతిక లోపం.. కోల్కతాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్
Hydrabad | చట్నీ విషయంలో దంపతుల మధ్య గొడవ.. ఆత్మహత్య చేసుకున్న భార్య
Vijay Devarakonda | ఫిబ్రవరిలో విజయ్, రష్మిక నిశ్చితార్థం.. అదంతా అబద్ధమన్న రౌడీస్టార్