న్యూఢిల్లీ: ఇండిగోకు ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల ముంబై విమానాశ్రయంలో ఇండిగో విమానం పక్కనే రన్వేపై కూర్చుని ప్రయాణికులు ఆహారాన్ని భుజించిన ఘటనపై డీజీసీఏ సీరియస్ అయ్యి ఇండిగోకు రూ.1.20 కోట్లు, బాంబే ఎయిర్పోర్టుకు 90 లక్షల జరిమానా విధించింది. నియమాలు ఉల్లంఘించినందుకు జరిమానా విధించినట్టు డీజీసీఏ, బీసీఏఎస్ తెలిపింది. పైలట్ రోస్టరింగ్లో లోపాలకు ఎయిరిండియా, స్పైస్జెట్ సంస్థలకు తలా రూ.30 లక్షల జరిమానా విధించింది.