న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: భారత్కు చెందిన యూపీఐ ఆధారిత చెల్లింపులు శ్రీలంక, మారిషస్ దేశాల్లో సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించిన వర్చువల్ కార్యక్రమంలో భారత ప్రధాని మోదీ, శ్రీలంక, మారిషస్ దేశాలకు చెందిన అధినేతలు పాల్గొననున్నారు.
అదే విధంగా మారిషస్లో రూపే కార్డు సేవల ప్రారంభాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించనున్నట్టు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. శ్రీలంక, మారిషస్తో భారత ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం అవుతున్న తరుణంలో ఆ దేశాల్లో భారత సేవలు ప్రారంభం కావడం సంతోషకరమని పేర్కొన్నది.