న్యూఢిల్లీ: దేశంలో ఒమిక్రాన్ శరవేగంగా వ్యాపిస్తున్నది. కేసుల సంఖ్య 1500కు చేరుతున్నది. శనివారం నాటికి 1431 కొత్త వేరియంట్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. ఐదు రాష్ట్రాల్లో వందకుపైగా ఒమిక్రాన్ కేసులున్నట్లు పేర్కొంది. 454 కేసులతో టాప్లో మహారాష్ట్ర, 351 కేసులతో రెండో స్థానంలో ఢిల్లీ, 118 కేసులతో మూడో స్థానంలో తమిళనాడు, 115 కేసులతో నాలుగో స్థానంలో గుజరాత్, 109 కేసులతో ఐదో స్థానంలో కేరళ ఉన్నట్లు వెల్లడించింది. దేశంలోని 23 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది.