India Corona | భారత్లో కరోనా వైరస్ (India Corona Virus) వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. రోజు రోజుకీ కొత్త కేసుల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది. తాజాగా గత 24 గంటల వ్యవధిలో ఐదు వేలకు పైనే కొత్త కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ (Union Health Minister) అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు 1,60,742 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 5,335 కొత్త కేసులు బయటపడ్డాయి. ఇది నిన్నటితో పోలిస్తే 20 శాతం ఎక్కువ. నిన్న ఒక్కరోజే 4,435 కేసులు నమోదయ్యాయి. కాగా, గతేడాది సెప్టెంబర్ 23 తర్వాత రోజూవారీ కొవిడ్ కేసులు 5,000 వేల మార్క్ను దాటడం ఇదే తొలిసారి.
తాజా కేసులతో దేశంలో పాజిటివ్ కేసుల (Positive Cases) సంఖ్య 4,47,33,719కి చేరింది. మరోవైపు దేశంలో యాక్టివ్ కేసుల (Active Cases) సంఖ్య ఏకంగా 25వేల మార్క్ను దాటేసింది. ప్రస్తుతం 25,587 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. నిన్న ఒక్కరోజే మహమ్మారి నుంచి 2,826 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 4,41,82,538కి చేరింది. ఇక బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు 24 గంటల వ్యవధిలో కేరళలో ఎనిమిది మంది, కర్ణాటక, మహారాష్ట్రలో ఇద్దరు చొప్పున, పంజాబ్లో ఒక్కరు చొప్పున మొత్తం 13 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో కరోనా మరణాల సంఖ్య 5,30,929కి చేరింది.
ప్రస్తుతం దేశంలో 0.06 శాతం కేసులు యాక్టివ్గా ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ (Union Health Minister) తెలిపింది. రికవరీ రేటు 98.75 శాతం, మరణాల రేటు 1.19 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. ఇప్పటి వరకు 220.66 కోట్ల (220,66,18,366) కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు వెల్లడించింది. దేశంలో కొవిడ్(Covid 19) కేసులు మళ్లీ పెరగడానికి ఎక్స్బీబీ.1.16 వేరియంట్ కారణమై ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. వైరస్లో మ్యుటేషన్లు జరుగుతున్న కొద్దీ ఇటువంటి కొత్త వేరియంట్లు పుట్టుకొస్తూనే ఉంటాయన్నారు.
Also Read..
Adipurush | హనుమాన్ జయంతి సందర్భంగా.. ఆదిపురుష్ నుంచి హనుమంతుడి స్పెషల్ పోస్టర్..!
Kuno National Park | కూనో నేషనల్ పార్క్ నుంచి పారిపోయిన మరో చీతా..!
TREIRB | రాష్ట్రంలో 9231 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..