న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. కొత్తగా 2593 మంది వైరస్ బారిన పడ్డారు. దీంతో మొత్తం కేసులు 4,30,57,545కు చేరాయి. ఇందులో 4,25,19,479 మంది కోలుకోగా, 5,22,193 మంది మృతిచెందారు. మరో 15,873 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో 44 మంది మహమ్మారి వల్ల మరణించగా, 1755 మంది కోలుకున్నారు.
ఇక మొత్తం కేసులల్లో యాక్టివ్ కేసులు 0.04 శాతం మాత్రమేనని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అదేవిధంగా రికవరీ రేటు 98.75 శాతం ఉన్నదని, మరణాల రేటు 1.21 శాతంగా ఉందని, రోజువారీ పాటివిటీ రేటు 0.546 శాతానికి పెరిగిందని తెలిపింది. ఇప్పటివరకు 1,87,67,20,318 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని పేర్కొన్నది. ఇందులో శనివారం ఒక్కరోజే 19,05,374 మందికి వ్యాక్సినేషన్ చేశామని ప్రకటించింది.