Anju | అంజు (Anju).. ఈ పేరు గుర్తుండే ఉంటుంది. భారత్కు చెందిన 34 ఏళ్ల వివాహిత (Indian
woman ) అయిన ఆమె ఫేస్బుక్ ద్వారా పరిచయమైన స్నేహితుడి కోసం పాకిస్థాన్ (Pakistan)కు వెళ్లి
అతడిని పెళ్లాడింది. అప్పటి నుంచి అక్కడే ఉంటున్న అంజు.. తాజాగా భారత్కు రానున్నట్లు తెలుస్తోంది.
ఈ మేరకు ఆమె ఎన్వోసీ (NOC) పత్రం కోసం ఇస్లామాబాద్లోకి హోంశాఖకు దరఖాస్తు చేసుకున్నట్లు
ఆమె భర్త నస్రుల్లా తెలిపారు. నిరభ్యంతర పత్రం రాగానే అంజు భారత్కు వస్తారని వెల్లడించారు.
‘మేము ఇస్లామాబాద్లోని అంతర్గత మంత్రిత్వ శాఖ నుంచి ఎన్వోసీ (నో-అబ్జెక్షన్ సర్టిఫికేట్) కోసం ఎదురు
చూస్తున్నాము. దీని కోసం మేము ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నాము. ఎన్వోసీ ప్రక్రియ పూర్తవడానికి కాస్త
సమయం పడుతుంది. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే అంజు భారత్లో పర్యటిస్తుంది’ అని నస్రుల్లా
(Nasrullah) తెలిపారు.
రాజస్థాన్లోని భివాడి జిల్లాకు చెందిన 34 ఏళ్ల అంజు రాజస్థాన్కు చెందిన అర్వింద్ అనే వ్యక్తిని వివాహం
చేసుకుంది. వీరికి 15 ఏళ్ల కుమార్తె, ఆరేళ్ల కుమారుడు ఉన్నారు. అయితే, అంజూకు పాకిస్థాన్కు చెందిన
29 ఏండ్ల నస్రుల్లాతో ఫేస్బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. అదికాస్తా ప్రేమకు దారితీయడంతో అతడి
ప్రేమ కోసం భర్త, ఇద్దరు పిల్లల్ని వదిలేసి.. ఈ ఏడాది జూలైలో వాఘా సరిహద్దు గుండా పాక్లోకి
ప్రవేశించింది. అక్కడ తన ప్రియుడు నస్రుల్లాను కలిసింది. అక్కడి నుంచి ఖైబర్ ఫంఖ్తుఖ్వా (Khyber
Pakhtunkhwa)లోని ప్రియుడి ఇంటికి వెళ్లింది. అక్కడ ఆమె హిందూ మతం నుంచి ఇస్లాంలోకి మారి
ఫాతిమాగా పేరు మార్చుకుంది. ఆ తర్వాత ప్రియుడు నస్రుల్లాను వివాహం చేసుకుంది. ఈ క్రమంలో ఆమెకు పాకిస్థాన్ ప్రభుత్వం ఏడాది చెల్లుబాటయ్యే వీసాను మంజూరు చేసింది.
Also Read..
Congress | మళ్లీ బకరాలయ్యాం.. పార్టీ మాటలు నమ్మి ఆగమైన కాంగ్రెస్ ఒరిజినల్ లీడర్లు
Vizianagaram Train Accident | కంటకాపల్లి రైలు ప్రమాదంలో ఇద్దరు లోకోపైలట్లు, గార్డు మృతి
MLA Seethakka | ములుగు ముచ్చట.. ప్రచారమే తప్ప ప్రగతిపై దృష్టిపెట్టని సీతక్క