జమ్ముకశ్మీర్లోని కార్గిల్ కొండలను ఆక్రమించుకోవాలన్ని పాకిస్తాన్ కుట్రలను భారతదేశం విజయవంతంగా తిప్పికొట్టింది. దాదాపు మూడు నెలలపాటు కొనసాగిన యుద్ధంలో భారత సైన్యం పాకిస్తాన్ తోక ముడిచి పారిపోయేలా చేసి కార్గిల్ కొండలను రక్షించారు. ఈ యుద్ధంలో భారత్కు చెందిన ఎందరో సైనికులు అమరవీరులయ్యారు. దేశాన్ని కాపాడటంలో ప్రాణాలను ఫణంగా పెట్టిన కార్గిల్లో విజయాన్ని నమోదుచేసిన సందర్భానికి గుర్తుగా ఏటా కార్గిల్ విజయ్ దివాస్ జరుపుకుంటున్నాం. భారతదేశం యొక్క ఈ విజయాన్ని, సైనికుల శౌర్యాన్ని గుర్తుచేసుకుంటుంటాం.
జమ్ముకశ్మీర్లోని కార్గిల్ ఎత్తైన కొండలను స్వాధీనం చేసుకుని వారి స్థావరాలను ఏర్పాటుచేసుకోవాలని పాకిస్తాన్ సైన్యం కుట్ర పన్నినప్పుడు ఈ యుద్ధం ప్రారంభమైంది. 1999 మే 3 న ప్రారంభమైన ఈ సంఘర్షణ చివరకు కార్గిల్ కొండలను కాపాడుకోవడంతో జూలై 26 న ముగిసింది. దాదాపు 12 మంది పాకిస్తాన్ సైనికులు కార్గిల్ అజామ్ పోస్టును స్వాధీనం చేసుకున్నారు. ఈ పాకిస్తాన్ సైనికులను భారత్కు చెందిన ఒకర గొర్రెల కాపరి గుర్తించి భారత ఆర్మీ సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. దాంతో పాకిస్తాన్ సైన్యం చొరబాటు గురించి సమాచారం వచ్చింది.దాంతో ‘ఆపరేషన్ విజయ్’ చేపట్టేందుకు భారత సైన్యం సన్నాహాలు ప్రారంభించింది.
పాక్ సైనికులు ఎత్తైన కొండలపై కూర్చున్న కారణంగా భారత సైనికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శత్రు సైనికులు చూడకుండా ఉండటానికి రాత్రి వేళలో కొండలపైకి ఎక్కారు. పాకిస్తాన్ సైన్యాన్ని కార్గిల్ విడిచి పారిపోయేలా చేయడంలో ఆర్మీతోపాటు వైమానిక దళం, నావికాదళం కూడా పెద్ద పాత్ర పోషించాయి. మిగ్-29, మిరాజ్-2000 విమానాల ద్వారా వైమానిక దళం పాకిస్తాన్ సైనికులపై బాంబు దాడులు చేసి పాకిస్తాన్ రెండు యుద్ధ విమానాలను కూల్చివేసింది. ఆకాశం నుంచి వైమానిక దళం దాడి, భూతలం నుంచి బోఫోర్స్ ఫిరంగుల నుంచి గుండ్లు పాకిస్తాన్ సైనికులను వర్షం కురిపించాయి. దాంతో పాకిస్తాన్ సైనికులు కాళ్లకు బుద్ధి చెప్పారు. రెండు నెలలకు పైగా కొనసాగిన ఈ యుద్ధంలో 527 మంది భారతీయ సైనికులు అమరవీరులయ్యారు. పాకిస్తాన్కు చెందిన 3,000 మంది సైనికులు కూడా మరణించారు.
2016: అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా హిల్లరీ క్లింటన్ను ప్రకటించిన డెమొక్రాటిక్ పార్టీ
2009: ‘విజయ్ దివాస్’ వార్షికోత్సవం సందర్భంగా తన మొదటి అణు జలాంతర్గామిని ‘అరిహంత్’ ను ప్రయోగించిన భారతదేశం
1982: కూలీ చిత్రం షూటింగ్ సమయంలో గాయపడిన అమితాబ్ బచ్చన్
1965: బ్రిటిష్ పాలన నుంచి స్వతంత్ర్యదేశంగా ప్రకటించుకున్న మాల్దీవులు
1963: ప్రపంచంలో మొట్టమొదటి జియోసింక్రోనస్ ఉపగ్రహం సిన్కామ్-2 ను ప్రయోగించిన నాసా
1956: సూయజ్ కాలువను జాతీయం చేసిన టర్కీ అధ్యక్షుడు అబ్దేల్ నాజర్
1953: క్యూబన్ విప్లవం ప్రారంభం
1945: బ్రిటిష్ ఎన్నికలలో విన్స్టన్ చర్చిల్ ఓటమి
1908: అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఎఫ్బీఐ స్థాపన
మొబైల్ వాడకంలో మనకు మూడో స్థానం
ఒత్తిడితో తెల్లటి జుట్టుకు ప్రత్యక్ష సంబంధం : తేల్చిన పరిశోధకులు
3 డీ ప్రింటింగ్తో కృత్రిమ చెవులు, ముక్కు సృష్టి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..