న్యూఢిల్లీ: పంజాబీ ర్యాప్ సింగర్ సిద్ధూ మూసే వాలా (Sidhu Moose Wala) పాడిన పాటలు శ్రోతలను ఇంకా అలరిస్తూనే ఉన్నాయి. అతడు మనమధ్య లేనప్పటికీ ఆయ గాత్రం మాత్రం ఎక్కడోచోట వినిపిస్తూనే ఉన్నది. ఆయన పాడిన పాటలు యువతనే కాకుండా సరిహద్దుల్లో సైనికులను కూడా ఉత్తేజితులను చేస్తున్నాయి. ఈ పంజాబీ సింగర్ పాడిన బంబిహా బోలే పాటలను సరిహద్దుల అవతల ఔట్పోస్టుల్లో ఉన్న పాక్ సైనికులు లౌడ్ స్పీకర్లలో ప్లే చేశారు. ఆ పాటను విన్న బార్డర్కు ఇవతల వైపు ఔట్ పోస్టులో ఉన్న భారత జవాన్లు ఉత్సాహంగా డ్యాన్స్ వేశారు. భారత సైనికులు డాన్స్ వేస్తున్న వీడియోను పోలీసు అధికారి హెచ్జీఎస్ ధాలివాల్ గురువారం ట్విట్టర్లో షేర్ చేశారు. ఇప్పుడు ఆ వీడియో తెగషేర్ అవుతున్నది.
ప్రముఖ పంజాబీ సింగర్ సిద్ధూ మూసే వాలా ఈ ఏడాది మే 29న హత్యకు గురైన విషయం తెలిసిందే. తన కెరీర్లో ఎక్కువగా గ్యాంగ్స్టర్లను ఉత్సాహ పరిచేలా పాటలు పాడిన సిద్ధూ.. అదే గ్యాంగ్స్టర్ల చేతిలో దారుణ హత్యకు గురవడం విశేషం.
Sidhu’s songs playing across the border! bridging the divide! pic.twitter.com/E3cOwpdRvn
— HGS Dhaliwal (@hgsdhaliwalips) August 25, 2022