Indian Railways | న్యూఢిల్లీ, జనవరి 23: డబ్బులు లేకపోయినా ట్రైన్ టికెట్ బుక్ చేసుకునే సదుపాయాన్ని భారతీయ రైల్వే అందుబాటులోకి తెచ్చింది. ‘బుక్ నౌ.. పే లేటర్’ పేరుతో తీసుకొచ్చిన ఈ కొత్త విధానం ద్వారా ఒక్క రూపాయి చెల్లించకపోయినా ట్రైన్ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఇందుకు అదనంగా ఎలాంటి చార్జీలు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు.
అయితే, టికెట్ బుక్ చేసుకున్న 14 రోజుల్లోగా డబ్బులు చెల్లించాలి. చెల్లించకపోతే మాత్రం 3.5 శాతం సర్వీస్ చార్జ్ కట్టాల్సి ఉంటుంది. చెల్లింపు ఆలస్యమైనా కొద్ది చార్జీ పెరుగుతుంది. కాగా, ఈ పే లేటర్ సదుపాయాన్ని వినియోగించుకునేందుకు ముందుగా www.epaylater.in అనే వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాలి. టికెట్ బుక్ చేసుకున్నాక పేమెంట్ ఆప్షన్ను ఎంపిక చేసుకునేటప్పుడు ‘పే లేటర్’ ఆప్షన్ను ఎంచుకోవాలి.