Guinness Record | పుణే : పిల్లలకు కథలు చెప్పడంలో భారతీయ తల్లిదండ్రులు చైనాను వెనక్కు నెట్టి గిన్నిస్ రికార్డ్ సృష్టించారు. మహారాష్ట్రలోని పుణేలో ఉన్న ఎస్పీ కళాశాల మైదానంలో గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో 3,250 మంది తల్లిదండ్రులు, వారి పిల్లలు పాల్గొన్నారు.
కేంద్ర విద్యా శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ బుక్ ట్రస్ట్ (ఎన్బీటీ) ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఎన్బీటీ చైర్పర్సన్ మిలింద్ మరథే మాట్లాడుతూ తల్లిదండ్రులు సామూహికంగా తమ పిల్లలకు 4 నిమిషాల సేపు కథలను చదివి, వినిపించే కార్యక్రమాన్ని నిర్వహించామని, దీనిలో 3,250 మంది పాల్గొనగా 3,066 మంది విజయవంతంగా ఈ లక్ష్యాన్ని పూర్తి చేసినట్లు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అధికారులు ధ్రువీకరించారని తెలిపారు.