న్యూఢిల్లీ: సముద్రపు దొంగల ఆధీనంలో ఉన్న బంగ్లాదేశ్ షిప్ ద్వారా అత్యవసర సందేశం వచ్చింది. దీంతో భారత నావికాదళానికి చెందిన యుద్ధనౌక స్పందించింది. (Indian Navy Warship) బంగ్లాదేశ్ షిప్ను నిరంతరం గమనిస్తున్నట్లు ఇండియన్ నేవీ పేర్కొంది. బంగ్లాదేశ్కు చెందిన బల్క్ క్యారియర్ ఎంవీ అబ్దుల్లా 55,000 టన్నుల బొగ్గుతో మొజాంబిక్ రాజధాని మపుటో నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు బయలుదేరింది. మార్చి 12న సోమాలియా తీరంలో సాయుధులైన సముద్రపు దొంగలు ఆ కార్గో షిప్పై దాడి చేశారు. అందులోకి చేరుకోవడంతోపాటు బంగ్లాదేశ్కు చెందిన 23 మంది సిబ్బందిని నిర్బంధించారు.
కాగా, సముద్రపు దొంగల దాడి సందర్భంగా బంగ్లాదేశ్ షిప్ నుంచి అత్యవసర ఎస్ఓఎస్ సందేశం వచ్చింది.
దీంతో ఇండియన్ నేవీకి చెందిన యుద్ధ నౌక వెంటనే స్పందించింది. లాంగ్ రేంజ్ మారిటైమ్ పాట్రోల్ (ఎల్ఆర్ఎంపీ) విమానాన్ని రంగంలోకి దించింది. ఎంవీ అబ్దుల్లా కార్గో షిప్ను అది సమీపించింది. సాయుధులైన సముద్ర దొంగలు ఆ షిప్లో ఉన్నట్లు గమనించింది. సిబ్బంది పరిస్థితి గురించి తెలుసుకునేందుకు కమ్యూనికేషన్ కోసం ప్రయత్నించింది. అయితే ఆ షిప్ నుంచి ఎలాంటి స్పందన రాలేదని భారత నౌకాదళం తెలిపింది. ఈ నేపథ్యంలో దానిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు వెల్లడించింది.
#IndianNavy's Mission Deployed warship & an LRMP responded to a piracy attack on MV Abdullah, a Bangladeshi-flagged vessel, whilst enroute from Mozambique to the United Arab Emirates.
On receipt of intimation, the LRMP was immediately deployed & after locating the MV in evening… pic.twitter.com/mSkscXZwJK
— SpokespersonNavy (@indiannavy) March 15, 2024