న్యూఢిల్లీ: హౌతీ క్షిపణి దాడికి గురైన కార్గో షిప్కు చెందిన 21 మంది సిబ్బందిని ఇండియన్ నేవీ రక్షించింది. వీరిలో ఒక భారతీయ పౌరుడు కూడా ఉన్నాడు. (Indian Navy Rescues 21) గల్ఫ్ ఆఫ్ ఏడెన్లో ఈ సంఘటన జరిగింది. బార్బడోస్ దేశానికి చెందిన బల్క్ క్యారియర్ ఎంవీ ట్రూ కాన్ఫిడెన్స్పై మార్చి6న హౌతీలు డ్రోన్లు, క్షిపణులతో దాడి చేశారు. దీంతో కార్గో పిష్లో మంటలు చెలరేగాయి. ఈ దాడిలో ముగ్గురు సిబ్బంది మరణించగా పలువురు గాయపడ్డారు. ఆ షిప్ ధ్వంసం కావడంతో అందులోని సిబ్బంది దానిని వీడారు. లైఫ్ బోట్లలో సముద్రంలో ప్రయాణించారు. తమను కాపాడాలంటూ అత్యవసర సందేశాలు పంపారు.
కాగా, గల్ఫ్ ఆఫ్ ఏడెన్లో భద్రత కోసం మోహరించిన ఐఎన్ఎస్ కోల్కతా వెంటనే స్పందించింది. లైఫ్ బోట్లలో ఉన్న కార్గో షిప్ సిబ్బందిని కాపాడింది. హెలికాప్టర్, బోట్లు ద్వారా వారిని నౌకలోకి చేర్చింది. గాయపడిన వారికి వెంటనే వైద్య చికిత్స అందించింది. అనంతరం వారిని సురక్షిత ప్రాంతానికి చేర్చింది. హౌతీ క్షిపణి దాడికి గురైన కార్గో షిప్ సిబ్బందిని రక్షించిన వీడియో క్లిప్ను ఇండియన్ నేవీ షేర్ చేసింది.
#IndianNavy's swift response to Maritime Incident in #GulfofAden.
Barbados Flagged Bulk Carrier MV #TrueConfidence reported on fire after a drone/missile hit on #06Mar, approx 54 nm South West of Aden, resulting in critical injuries to crew, forcing them to abandon ship.… pic.twitter.com/FZQRBeGcKp
— SpokespersonNavy (@indiannavy) March 7, 2024