Indian Army | వాస్తవాధీన రేఖ (LAC) వెంట భారత్ – చైనా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. రెండుదేశాల మధ్య వివాదానికి కేంద్రంగా తూర్పు లద్దాఖ్లోని గల్వాన్ లోయ నిలిచిన విషయం తెలిసిందే. ఇరుదేశాలకు చెందిన సైనికుల మధ్య ఇక్కడ ఘర్షణ జరిగిన విషయం విధితమే. ప్రస్తుతం ఘర్షణ జరిగిన ప్రాంతంలో భారత సైనికులు క్రికెట్ ఆడుతున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలును ఇండియన్ ఆర్మీ అధికారికంగా విడుదల చేసింది. క్రికెట్తో పాటు ఐస్ హాకీ పోటీల్లోనూ సైనికులు పాల్గొన్నారు. అయితే, గల్వాన్లో ఎక్కడ ఆటలు ఆడారనే విషయాన్ని ఆర్మీ స్పష్టంగా ఎప్పకపోయినా పెట్రోలింగ్ పాయింట్-14కు నాలుగు కిలోమీటర్ల దూరంలో సైనికులు ఆటలు ఆడి ఉండవచ్చని సమాచారం. త్రిశూల్ డివిజన్కు చెందిన పాటియాలా బ్రిగేడ్ ఆర్మీ పోటీలను నిర్వహించినట్లు సమాచారం. మరో వైపు సరిహద్దుల్లో సైన్యం గుర్రాలపై పహారా కాస్తున్నది.
#WATCH | Indian Army troops playing cricket near the Galwan valley. The Indian Army formations deployed in the area have been engaging in different sports activities in extreme winters at these high-altitude locations
(Source: Indian Army officials) pic.twitter.com/cElsJLFg8I
— ANI (@ANI) March 4, 2023
ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. సముద్రమట్టానికి అధిక ఎత్తులో.. విపరీతమైన చలి పరిస్థితులు ఉన్నా వివిధ క్రీడా కార్యకలాపాలు కొనసాగుతున్నాయని, ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ జవాన్లు ఎంతో ధైర్యంతో ఉన్నారంటూ పలువురు ప్రశంసిస్తున్నారు. 2020 మేలో భారత్ – చైనా సైనికుల మధ్య గల్వాన్ ప్రాంతంలో ఘర్షణ జరిగిన విషయం విధితమే. ఈ ఘటనలో భారత్కు చెందిన 20 మంది సైనికులు వీరమరణం పొందారు. పెద్ద సంఖ్యలో చైనా సైనికులు సైతం ప్రాణాలు కోల్పోగా.. ఇప్పటి వరకు చైనా ఎంత మంది ప్రాణాలు కోల్పోయారన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఇదిలా ఉండగా.. ఢిల్లీలో నిర్వహిస్తున్న జీ20 సదస్సులో భాగంగా భారత విదేశాంగ మంత్రి జైశంకర్.. చైనా విదేశాంగ మంత్రితో సమావేశమైన తర్వాత రోజునే ఇండియన్ ఆర్మీ ఫొటోలను విడుదల చేయడం విశేషం.
#WATCH लद्दाख: भारतीय सेना की टुकड़ियों ने वास्तविक नियंत्रण रेखा(LAC) के पास DBO सेक्टर में आयोजित एक आइस हॉकी मैच में भाग लिया। pic.twitter.com/0iZUfeaZly
— ANI_HindiNews (@AHindinews) March 4, 2023