న్యూఢిల్లీ: పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకున్నది. బుధవారం తెల్లవారుజామున 1 గంట సమయంలో ‘ఆపరేషన్ సిందూర్’తో (Operation Sindoor) పాకిస్థాన్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ విరుచుకుపడింది. తొమ్మిది ఉగ్రవాద శిబిరాలు, శిక్షణా కేంద్రాలను భారత యుద్ధ విమానాలు ధ్వంసం చేశాయి. ఎంపిక చేసిన ఉగ్రవాద లక్ష్యాలపై భారత్ దాడి చేసిందని కల్నల్ సోఫియా ఖురేషి మీడియా సమావేశంలో తెలిపారు. కేవలం 23 నిమిషాల్లో నిర్ధేశిత లక్ష్యాలను ఇండియన్ ఎయిర్ఫోర్స్కు చెందిన యుద్ధ విమానాలు ధ్వంసం చేశాయని వివరించారు. సుమారు వంద మంది ఉగ్రవాదులు మరణించి ఉంటారని అంచనా వేశారు.
కాగా, పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లోని బహవల్పుర్లో ఉన్న జైషే ఈ మొహమ్మద్ ప్రధాన కార్యాలయం, ముర్దికేలోని లష్కరే తోయిబా బేస్ క్యాంపు, శిక్షణ కేంద్రం, కోట్లీలోని సూసైడ్ బాంబర్ ట్రైనింగ్, టెర్రర్ లాంచ్ బేస్, గుల్పూర్లోని ఉగ్రవాదుల లాంచ్ప్యాడ్, సవాయిలోని లష్కరే శిబిరం, సర్జల్, బర్నాలాలోని ఉగ్రవాదుల చొరబాటు కేంద్రాలు, మెహమూనాలోని హిజ్బుల్ ముజాహిద్దిన్ ఉగ్రవాద శిబిరం, బిలాల్లోని జేషే మహమ్మద్కు చెందిన మరో ల్యాంచ్ప్యాడ్ను ఇండియన్ ఎయిర్ఫోర్స్కు చెందిన యుద్ధ విమానాలు ధ్వంసం చేశాయి. కల్నల్ సోఫియా ఖురేషి ఈ వివరాలను మీడియాకు వివరించారు. ఆర్మీ విడుదల చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Indian army explaining with Video proofs how it attacked the terrorists camps in Pakistan and not civilians as falsely claimed by the Pak media and SM
A very courageous act by the Indian Army#OperationSindoor
pic.twitter.com/krxqapOApI— SS Sagar (@SSsagarHyd) May 7, 2025