న్యూఢిల్లీ: భారతీయ వాయు సేన కొత్త చరిత్ర సృష్టించింది. తొలిసారి నైట్ విజన్ గగూల్స్ను(Nnight Vision Goggles) వాడి.. రాత్రి పూట విమానాన్ని ల్యాండ్ చేసింది. ఈస్ట్రన్ సెక్టార్లో విమానాన్ని దించారు. రాత్రి పూట పెట్టుకున్న కంటి అద్దాలతో(ఎన్వీజీ) విమానాన్ని ల్యాండ్ చేసిన దృశ్యాలను ఐఏఎఫ్ తన ఎక్స్ అకౌంట్లో షేర్ చేసింది. ఐఏఎఫ్ సీ-130జే విమానం.. ఎన్వీజీ ఆధారంగా ల్యాండ్ అయినట్లు పేర్కొన్నది. ఈస్ట్రన్ సెక్టార్లో ఉన్న అడ్వాన్స్డ్ ల్యాండింగ్ గ్రౌండ్లో ఆ విమానాన్ని దించారు.
ఈస్ట్రన్ సెక్టార్ కింద ఈశాన్య రాష్ట్రాలు ఉంటాయి. ఒడిశా, జార్ఖండ్, సిక్కిం, వెస్ట్ బెంగాల్, బీహార్ కూడా ఉన్నాయి. చైనా, నేపాల్, భూటాన్, మయన్మార్, బంగ్లాదేశ్ తో ఉన్న 6300 కిలోమీటర్ల బోర్డర్.. ఈస్ట్రన్ సెక్టార్ కిందకు వస్తుంది. నైట్ విజన్ గగూల్స్ టెక్నాలజీ ద్వారా .. వాయు సేన ఇప్పుడు మరింత సురక్షితమైన, శక్తివంతమైన రీతిలో పనిచేయనున్నది. వెలుతురు తక్కువ ఉన్న సమయాల్లో, రాత్రి పూట సెర్చ్ ఆపరేషన్లు చేపట్టేందుకు ఇక నుంచి ఎన్వీజీ టెక్నాలజీని ఐఏఎఫ్ వాడనున్నది.
వాయు సేన తన ఎక్స్ అకౌంట్లో రెండు వీడియోలను అప్లోడ్ చేసింది. ఒక వీడియోలో.. ఎన్వీజీ ద్వారా విమానం సాఫ్ట్ ల్యాండింగ్ అయిన దృశ్యాలు ఉన్నాయి. మరో వీడియోలో.. విమానంలో లోపలి నుంచి దృశ్యాలను చూపించారు. రెండు వీడియోలు గ్రీన్ కలర్లో ఉన్నాయి. ఎన్వీజీ విజువల్స్ జనరల్గా ఇలాగే ఉంటాయి. హర్ కామ్ దేశ్ కే నామ్ అంటూ ఆ వీడియోలకు ఓ ట్యాగ్లైన్ కూడా ఇచ్చారు.
ఇటీవల కార్గిల్లో సీ130-జే విమానాన్ని కూడా రాత్రి పూట ల్యాండ్ చేసిన విషయం తెలిసిందే.
Achieving another significant milestone, an #IAF C-130J aircraft carried out a successful Night Vision Goggles aided landing at an Advanced Landing Ground in the Eastern sector.#IAF continues to expand capabilities, reinforcing commitment to safeguard nation’s sovereignty by… pic.twitter.com/nMAbDnWPhR
— Indian Air Force (@IAF_MCC) May 23, 2024