PM Modi | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్ (నమస్తే తెలంగాణ): ‘భారత్ అభివృద్ధి చెందుతున్న దేశమని చిన్నప్పటి నుంచి చదువుకున్నా. ఉద్యోగం చేస్తున్నప్పుడూ అదే వింటున్నా. అభివృద్ధి చెందిన దేశంగా ఇంకెప్పుడు మారుతుంది?’ అంటూ ఓ తెలుగు సినిమాలో హీరో ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. ప్రధాని మోదీ ప్రకటనలు వింటే సరిగ్గా ఇలాగే అనిపిస్తుంది. 2017లో కేదార్నాథ్ ఆలయాన్ని సందర్శించిన సమయంలో మోదీ మాట్లాడుతూ.. 2022 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మారుస్తామంటూ ఊదరగొట్టారు. ఆ డెడ్లైన్ తప్పిపోయింది.
2022లో స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో మాట్లాడుతూ.. 25 ఏండ్లలో భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మారుస్తానని ప్రతినబూనారు. తాజాగా మంగళవారం మాట్లాడుతూ.. వచ్చే 25 ఏండ్లలో భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మారుస్తామంటూ చెప్పుకొచ్చారు. ఏడాది తర్వాత అదే ప్రకటన చేసినప్పుడు.. 25 ఏండ్ల వ్యవధిలో ఒక ఏడాదిని తగ్గిస్తూ.. 24 ఏండ్లు అని చెప్పాలి. ప్రధాని అలా చేయలేదు. దీంతో ‘భారత్ అభివృద్ధి చెందిన దేశం’గా మారాలంటే ఇంకా ఎన్ని డెడ్లైన్లు మార్చుకోవాలో? అంటూ సోషల్మీడియాలో పలువురు కామెంట్లు పెడుతున్నారు.