న్యూఢిల్లీ: దేశంలో ఎండలు మండిపోతున్నాయి. గత కొన్ని రోజులుగా భానుడు భగ్గుమంటున్నాడు. పగటిపూట పనుల మీద బయటికి వచ్చిన జనం వేసవి తాపానికి తాళలేక విలవిల్లాడుతున్నారు. ఎండలకు తోడు ఉక్కపోత కూడా జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. ఉత్తరాది, దక్షిణాది అనే తేడా లేకుండా దేశమంతా భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు.
ఈ నేపథ్యంలో ఇవాళ భారత వాతావరణ కేంద్రం ఇచ్చిన నివేదిక (IMD report) భయం పుట్టిస్తున్నది. రాబోయే ఐదు రోజులపాటు దేశంలో పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్నాయని IMD తెలిపింది. దేశంలోని పశ్చిమ, మధ్య, తూర్పు ప్రాంతాలతోపాటు వాయవ్యంలోని కొన్నిచోట్ల 2 నుంచి 4 డిగ్రీ సెంటీగ్రేడ్ల వరకు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని IMD పేర్కొంది.