న్యూఢిల్లీ : ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి పవిత్ర మార్గ్గరిటా, బీహార్ గవర్నర్ సయ్యద్ అతా హస్నైన్ను భారత ప్రభుత్వం పంపనున్నట్టు ప్రభుత్వ వర్గాలు సోమవారం ఇండియా టుడేకి తెలిపాయి. గత వారం ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ ప్రధాని నరేంద్ర మోదీని ఖమేనీ అంత్యక్రియలకు ఆహ్వానించారు.
అంత్యక్రియలు జూలె 4న ప్రారంభమై జూలై 9న ముగుస్తాయి. టెహ్రాన్, మష్షద్, కోమ్లో జరిగే ఈ అంత్యక్రియలకు 2 కోట్ల మంది హాజరవ్వచ్చని అంచనా. ఈ అంత్యక్రియల్లో ప్రస్తుత ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ కనిపిస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.