న్యూఢిలీ: ప్రపంచ దేశాల్లో బలమైన కూటమిగా పేరొందిన జీ-20 అధ్యక్ష బాధ్యతలను భారత్ భుజానికెత్తుకొన్నది.
అధికారికంగా గురువారం బాధ్యతలు చేపట్టింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు థీమ్ ప్రేరణతో ఏకత్వాన్ని ప్రోత్సహించేందుకు పనిచేయనున్నట్టు తెలిపారు. దీనివల్ల ఉగ్రవాదం, వాతావరణ ముప్పు వంటి సవాళ్లను ఎదుర్కోవచ్చని వెల్లడించారు.