న్యూఢిల్లీ : డోక్లాం వద్ద చైనా కార్యకలాపాలపై నిఘా పెంచామని ప్రభుత్వం పేర్కొంది. జాతీయ భద్రతకు ముప్పు కలిగించే పరిణామాలను ఎప్పటికప్పుడు పసిగడుతున్నామని తెలిపింది. దేశ భద్రతను కాపాడేందుకు అవసరమైన చర్యలను ప్రభుత్వం చేపడుతుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరందం బాగ్చి పేర్కొన్నారు.
డోక్లాం సమీపంలో చైనా కార్యకలాపాలకు సంబంధించిన వార్తలపై తాను నిర్ధిష్ట వ్యాఖ్యలు చేయబోనని దేశ భద్రతకు విఘాతం కలిగించే చర్యలపై ప్రభుత్వం కన్నేసి ఉంచుతుందని, భద్రతను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతుందని ఆయన స్పష్టం చేశారు. డోక్లాం వద్ద భూటాన్ వైపున చైనా ఓ గ్రామాన్ని నిర్మిస్తున్నదని తాజా శాటిలైట్ ఇమేజ్లకు సంబంధించి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ అరిందం బాగ్చి ఈ వ్యాఖ్యలు చేశారు.