India Corona | దేశంలో కరోనా వైరస్ (India Corona Virus) వ్యాప్తి కొనసాగుతోంది. వరుసగా మూడో రోజూ 3 వేలకుపైనే కొత్త కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ (Union Health Ministry) వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల వ్యవధిలో 1,73,263 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 3,611 కొత్త కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కరోనా బారిన పడిన వారి సంఖ్య 4,49,64,289కి చేరింది.
ప్రస్తుతం దేశంలో 33,232 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇప్పటి వరకు కొవిడ్ నుంచి 4,43,99,415 మంది కోలుకున్నారు. గత 24 గంటల్లో 36 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కొవిడ్ మరణాల సంఖ్య 5,31,642కి ఎగబాకింది.
ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో 0.07 శాతం మాత్రమే యాక్టివ్గా ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. రికవరీ రేటు 98.74 శాతం, మరణాల రేటు 1.18 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. ఇక ఇప్పటి వరకు 220.66 కోట్ల (220,66,75,365) కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది.
Also Read..
Video | ఉక్రెయిన్ ఎంపీ చేతిలోని జెండాను లాక్కున్న రష్యా ప్రతినిధి.. చావబాదిన ఎంపీ
MLA Vungzagin Valte | మణిపూర్లో బీజేపీ ఎమ్మెల్యేపై దాడి.. విషమంగా పరిస్థితి