న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గురువారం 7,974 కేసులు నమోదవగా, తాజాగా అవి 7 వేల 5 వందల లోపే రికార్డయ్యాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 7447 మంది కరోనా బారినపడ్డారు. దీంతో మొత్తం బాధితులు 3,47,26,049కి పెరిగారు. ఇందులో 3,41,54,879 మంది కరోనా నుంచి బయటపడ్డారు. ఇంకా 86,415 కేసులు యాక్టివ్గా ఉండగా, 4,76,869 మంది మహమ్మారి వల్ల మరణించారు.
గురువారం ఉదయం నుంచి ఇప్పటివరకు కొత్తగా 7886 మంది కోలుకోగా, 391 మంది బాధితులు మృతిచెందారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కాగా, గురువారం రాత్రి వరకు 1,35,99,96,267 కరోనా డోసులను పంపిణీ చేశామని తెలిపింది.