న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. మంగళవారం 5,439 మందికి పాజిటివ్ నిర్ధారణ కాగా, నేడు కొత్తగా మరో 7,231 మందికి కరోనా సోకింది. దీంతో మొత్తం కేసులు 4,44,28,393కు చేరాయి. ఇందులో 4,38,35,852 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు 5,27,874 మంది మృతిచెందారు. మరో 64,667 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. గత 24 గంటల్లో 45 మంది మరణించగా, 10,828 మంది కోలుకున్నారు.
కాగా, రోజువారీ పాజిటివిటీ రేటు 2.05 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొత్తం కేసుల్లో 0.15 శాతం కేసులు యాక్టివ్గా ఉన్నాయని, రికవరీ రేటు 98.67 శాతం, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని పేర్కొన్నది. ఇక దేశవ్యాప్తంగా 212.39 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని తెలిపింది.