న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 58,077 కరోనా (Corona) పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,25,36,137కు చేరాయి. ఇందులో 4,13,31,158 మంది వైరస్ నుంచి బయటపడ్డారు. మరో 6,97,802 కేసులు యాక్టివ్గా ఉండగా, 5,07,177 మంది మృతిచెందారు.
కాగా, గత 24 గంటల్లో 1,50,407 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా 657 మంది మరణించామని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కేసులు తగ్గడంతోపాటు కోలుకుంటున్న వారి సఖ్య అధికమవడంతో రోజువారీ పాజిటివిటీ రేటు 3.89 శాతానికి తగ్గిందని, రికవరీ రేటు 97.17 శాతానికి పెరిగిందని తెలిపింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1,71,79,51,432 కొవిడ్ డోసులను పంపిణీ చేశామని పేర్కొన్నది.