న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 5,664 మందికి కరోనా నిర్ధరణ అయింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసులు 4,45,34,188కి చేరాయి. ఇందులో 4,39,57,929 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,28,337 మంది మరణించారు. మరో 47,922 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇక గత 24 గంటల్లో కరోనా బారిన పడి 35 మంది చనిపోయారు. ఒక్కరోజులో 4,555 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.
కేసులు భారీగా తగ్గిపోవడంతో రోజువారీ పాజిటివిటీ రేటు 1.96 శాతానికి పడిపోయిందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొత్తం కేసుల్లో 0.11 శాతం కేసులు యాక్టివ్గా ఉండగా, రికవరీ రేటు 98.71 శాతం, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని తెలిపింది. ఇప్పటివరకు 216.56 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని పేర్కొన్నది.