న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 5554 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,44,90,283కు చేరాయి. ఇందులో 4,39,13,294 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,28,139 మంది మృతిచెందారు. మరో 48,850 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇక గత 24 గంటల్లో 6322 మంది వైరస్ నుంచి బయటపడగా, 16 మంది మరణించారు.
రోజువారీ పాజిటివిటీ రేటు 1.47 శాతానికి తగ్గిందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొత్తం కేసుల్లో 0.11 శాతం కేసులు యాక్టివ్గా ఉన్నాయని, 98.70 శాతం మంది కోలుకున్నారని, 1.19 శాతం మంది చనిపోయారని ప్రకటించింది. ఇప్పటివరకు 214.77 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులన పంపిణీ చేశామని తెలిపింది.