న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 5221 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,45,00,580కు చేరింది. ఇందులో 4,39,25,239 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకున్నారు. మరో 5,28,165 మంది మరణించారు. ఇంకా 47,176 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. గత 24 గంటల్లో 5975 మంది కరోనా నుంచి బయటపడగా, 11 మంది మరణించారు.
రోజువారీ పాజిటివిటీ రేటు 2.82 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొత్తం కేసుల్లో 0.11 శాతం కేసులు యాక్టివ్గా ఉండగా, రికవరీ రేటు 98.71 శాతం, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని తెలిపింది. 215.26 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని పేర్కొన్నది.