న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 39,097 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,13,32,159కు చేరింది. ఇందులో 3,05,03,166 మంది కోలుకోగా, మరో 4,20,016 మంది బాధితులు వైరస్ వల్ల మరణించారు. మొత్తం కేసుల్లో 4,08,977 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. కాగా, నిన్న ఉదయం నుంచి ఇప్పటివరకు 35,087 మంది కోలుకోగా, కొత్తగా 546 మంది మృతిచెందారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ముమ్మరంగా కొనసాగుతున్నది. ఇప్పటివరకు 42,78,82,261 మందికి వ్యాక్సిన్ పంపిణీ చేశామని తెలిపింది. రికవరీ రేటు 97.35 శాతంగా ఉందని ఆరోగ్య శాఖ వెల్లడించింది. అదేవిధంగా మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 1.31గా ఉందని తెలిపింది. ఈ వారం పాజిటివిటీ రేటు 2.22 శాతంగా ఉండగా, రోటువారీ పాజిటివిటీ రేటు 2.40 శాతం ఉందని పేర్కొన్నది. ఇలా పాజిటివిటీ రేటు 3 శాతానికి తక్కువగా ఉండటం వరుసగా ఇది 33వ రోజని తెలిపింది. ఇక దేశవ్యాప్తంగా 45.45 కోట్ల మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని వెల్లడించింది.