న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 3615 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,45,79,088కి చేరాయి. ఇందులో 4,40,09,525మంది బాధితులు వైరస్ నుంచి కోలుకోగా 5,28,584 మంది మరణించారు. మరో 40,979 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. గత 24 గంటల్లో 14 మంది మృతిచెందగా, 4972 మంది కరోనా నుంచి బయటపడ్డారు.
రోజువారీ పాజిటివిటీ రేటు 1.12 శాతం కేసులు యాక్టివ్గా ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. రికవరీ రేటు 98.72 శాతంగా ఉందని, యాక్టివ్ కేసులు 0.10 శాతంగా ఉందని తెలిపింది.