న్యూఢిల్లీ: దేశంలో రోజువారీ కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. కొత్తగా మరో 2451 మంది కరోనా బారినపడ్డారు. దీంతో మొత్తం కేసులు 4,30,52,425కు చేరాయి. ఇందులో 4,25,16,068 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. మరో 5,22,116 మంది మృతిచెందగా, 14,241 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. గత 24 గంటల్లో 54 మంది వైరస్కు బలవగా, 1589 మంది మహమ్మారి నుంచి బయటపడ్డారు.
ఇక మొత్తం కేసుల్లో 0.03 శాతం కేసులు మాత్రమే యాక్టివ్గా ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటివరకు 98.75 శాతం మంది కోలుకోగా, 1.21 శాతం మంది మృతిచెందారని తెలిపింది. దేశవ్యాప్తంగా 1,87,26,26,515 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని, నిన్న ఒక్కరోజే 18,03,558 మందికి వ్యాక్సినేషన్ చేశామని పేర్కొన్నది.