న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గత నాలుగు రోజులుగా 20 వేలకుపైగా నమోదవుతున్న రోజువారీ పాజిటివ్ కేసులు తాజాగా 19,673కు చేరాయి. దీంతో మొత్తం కేసులు 4,40,19,811కు చేరాయి. ఇందులో 4,33,49,778 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు కరోనాతో 5,26,357 మంది మరణించారు. మరో 1,43,676 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇక గత 24 గంటల్లో కొత్తగా 45 మంది మృతిచెందగా, 19,336 మంది డిశ్చార్జీ అయ్యారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
మొత్తం కేసుల్లో 0.33 శాతం కేసులు యాక్టివ్గా ఉన్నాయని, రికవరీ రేటు 98.48 శాతం, మరణాలు 1.20 శాతంగా ఉన్నాయని తెలిపింది. ఇక ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 204.25 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని ప్రకటించింది.