న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు (Covid-19) స్వల్పంగా పెరిగాయి. బుధవారం 10,197 కేసులు నమోదవగా, నేడు ఆ సంఖ్య 12 వేలకు చేరువయ్యాయి. నిన్నటికంటే ఇది 15 శాతం అధికమని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 11,919 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,44,78,517కు చేరాయి. ఇందులో 3,38,85,132 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకున్నారు. 1,28,762 కేసులు యాక్టివ్గా ఉండగా, 4,64,623 మంది మృతిచెందారు. కొత్త కేసుల్లో 6849 కేసులు ఒక్క కేరళలోనే ఉన్నాయని ఆరోగ్య శాఖ వెల్లడించింది.
కాగా, నిన్న ఉదయం నుంచి ఇప్పటివరకువ 11,242 మంది కరోనా నుంచి బయటపడగా, 470 మంది మరణించారని తెలిపింది. ఇక మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.37 శాతం ఉన్నాయని, 2020 మార్చి తర్వాత ఇదే అత్యంత కనిష్ఠమని పేర్కొన్నది.