న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 11,539 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,43,39,429కి చేరాయి. ఇందులో 4,37,12,218 మంది బాధితులు కోలుకోగా, 5,27,332 మంది మరణించారు. మరో 99,879 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. జూన్ 30 తర్వాత యాక్టివ్ కేసులు లక్ష దిగువకు చేరడం ఇదే మొదటిసారి. కాగా, గత 24 గంటల్లో 43 మంది మృతిచెందగా, 12,783 మంది డిశ్చార్జీ అయ్యారు.
మొత్తం కేసుల్లో 0.23 శాతం కేసులు యాక్టివ్గా ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. రికవరీ రేటు 98.59 శాతం, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని తెలిపింది. దేశవ్యాప్తంగా 209.67 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీచేశామని పేర్కొన్నది.