న్యూఢిల్లీ: దేశంలో రోజువారీ కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. కొన్నిరోజులు 10 వేల పైచిలుకు కేసులు నమోదవుతుండగా, తాజాగా అవి 11 వేలు దాటాయి. ఇది మంగళవారం నాటికి కేసుల కంటే 13.2 శాతం అధికమని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 11,466 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,43,88,579కి చేరాయి. ఇందులో 1,39,683 కేసులు యాక్టివ్గా ఉండగా, 3,37,87,047 మంది బాధితులు కోలుకున్నారు. మరో 4,61,849 మంది మహమ్మారికి బలయ్యారు. కాగా, మంగళవారం ఉయదం నుంచి ఇప్పటివరకు కొత్తగా 11,961 మంది కరోనా నుంచి కోలుకోగా, 460 మంది మృతిచెందారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే కొత్త కేసుల్లో కేరళలోనే 6,409 కేసులు ఉండటం విశేషం. రాష్ట్రంలో మరో 47 మంది మరణించారు.